News April 6, 2024

జగన్ పాలన ఓ పీడ కల: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ ఐదేళ్ల పాలన ఓ పీడ కల అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది. ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి. అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తా. పేదలకు ఉచిత ఇసుక అందిస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. జనం భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 9, 2026

ముగిసిన పోలింగ్.. 2021 రికార్డులు బ్రేక్!

image

పుదుచ్చేరి, అస్సాం, కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ మూడు చోట్లా ఓటర్ టర్నౌట్ భారీగా నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పుదుచ్చేరిలో 86.9% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అస్సాంలో 84.4%, కేరళంలో 75% పోలింగ్ నమోదైంది. దీంతో 2021లో నమోదైన <<19607756>>పోలింగ్<<>> రికార్డులు బ్రేక్ అయ్యాయి.

News April 9, 2026

సిల్వర్ రేటూ తగ్గింది!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. కేజీపై రూ.5,000 తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కేజీపై ఏకంగా రూ.10వేలు పెరిగిన సిల్వర్ ఇవాళ రూ.5వేలు తగ్గడం గమనార్హం. ఇక ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2,340 తగ్గి రూ.1,51,480గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పైనా రూ.2,150 తగ్గి 1,38,850కి చేరిన విషయం తెలిసిందే.

News April 9, 2026

ప్రియాంకా చోప్రా బ్యూటీ సీక్రెట్ తెలుసా?

image

చర్మసౌందర్యానికి చాలా మంది ఫేస్‌వాష్‌లు, క్రీమ్‌లు వాడుతుంటారు. కానీ అవేమీ అవసరం లేదని, శనగపిండితో చేసే ఫేస్‌ప్యాక్ ముఖానికి నిగారింపు ఇస్తుందని నటి ప్రియాంకా చోప్రా తల్లి డా.మధు చోప్రా చెబుతున్నారు. శనగపిండి, పసుపు, వెన్న- పాలు కలిపి చేసిన క్రీమ్, ఇంకాస్త పాలను కలుపుకొని ముఖానికి పూసుకొని 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాను, ప్రియాంక కూడా ఇదే ఫాలో అవుతామని తెలిపారు.