News April 19, 2024
జగన్ పాలనంతా అంకెల గారడీలు, అబద్ధాలే: ప్రత్తిపాటి

AP: ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ‘ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది. తుఫాన్లు, వరదలు, కరవుతో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం అందింది. అంకెల గారడీలు, అబద్ధాలతో జగన్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. వైసీపీ పాలనతో రైతుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి’ అని విమర్శించారు.
Similar News
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ, ఉ.గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఇవాళ 5PM వరకు నెల్లూరు(D) కొడవలూరులో 38.7mm, నెల్లూరులో 36.7mm, తిరుపతి(D) తడలో 33.5MM వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
News December 1, 2025
హీట్ పెంచుతున్న ‘హిల్ట్’!

TG: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(HILT) పాలసీ రాజకీయంగా హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని GOVT చెబుతోంది. అయితే భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, ₹5L Cr స్కామ్ జరుగుతోందని BRS, BJP <<18438533>>విమర్శిస్తున్నాయి<<>>. తాజాగా గవర్నర్కు కంప్లైంట్ చేరింది. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో?


