News October 9, 2024

వరద సాయంపై జగన్ విష ప్రచారం: లోకేశ్

image

AP: వరద బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వత్తులకు రూ.23 లక్షలు సైతం ఖర్చు కాకున్నా రూ.23 కోట్లు అయినట్లు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పాలనలో ప్రతి లెక్క పారదర్శకంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.1 కోటిలో ఇంతవరకు ఒక్క రూపాయైనా ఇవ్వలేదని లోకేశ్ చురకలంటించారు.

Similar News

News December 26, 2025

ప్రకాశం: పండగలకు ఊరు వెళ్తున్నారా..!

image

సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. దీంతో అందరూ బంధుమిత్రుల గ్రామాలకు తరలి వెళ్తారు. దీంతో కొందరు తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారన్నారు. ఈ సమయంలో ప్రకాశం పోలీసులు అందించే ఫ్రీ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని SP హర్షవర్ధన్ రాజు గురువారం కోరారు. LHMS సర్వీస్‌ను ప్రజలు ఉచితంగా పొందాలన్నారు. సమాచారం అందించిన ఇంటిని CC కెమెరాతో నిఘా ఉంచి, భద్రత కల్పిస్తామన్నారు.

News December 26, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✬ AP: వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు
✬ వైద్య రంగంలో PPPతోనే మేలు: నడ్డా లేఖ
✬ తల్లి విజయమ్మతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
✬ ఇద్దరు TG మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్
✬ రేవంత్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలి: హరీశ్ రావు
✬ వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
✬ బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

News December 26, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్‌రావు కస్టడీ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్‌రావు చెప్పారు.