News October 9, 2024

వరద సాయంపై జగన్ విష ప్రచారం: లోకేశ్

image

AP: వరద బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వత్తులకు రూ.23 లక్షలు సైతం ఖర్చు కాకున్నా రూ.23 కోట్లు అయినట్లు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పాలనలో ప్రతి లెక్క పారదర్శకంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.1 కోటిలో ఇంతవరకు ఒక్క రూపాయైనా ఇవ్వలేదని లోకేశ్ చురకలంటించారు.

Similar News

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News November 23, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/

News November 23, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.