News September 27, 2024

జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Similar News

News November 24, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేశ్ (19) మిత్రులతో కలిసి అలల్లో స్నానం చేస్తూ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అధికారులు నిన్నటి నుంచి గాలిస్తుండగా సోమవారం మోళ్లపర్రులో బీచ్‌లో లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.