News September 27, 2024

జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Similar News

News September 27, 2024

కర్ణాటక.. అడగ్గానే కుంకీ ఏనుగులను ఇచ్చింది: పవన్

image

AP: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 27, 2024

రేషన్‌కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి

image

TG: రేషన్‌కార్డు లేని నిరుపేదలకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయన్నారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్/పర్సన్ ఇన్‌ఛార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలుంటారని తెలిపారు. అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతామన్నారు.

News September 27, 2024

జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.