News October 23, 2024
నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటన
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం YSR జిల్లా బద్వేలు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
Similar News
News October 23, 2024
‘దానా’ తుఫాను.. ఆ పేరెవరు పెట్టారంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్లో ‘ఉదారత’ అని అర్థం.
News October 23, 2024
రూ.1,000 కోట్ల పెట్టుబడులు.. 12,500 మందికి ఉపాధి: ప్రభుత్వం
AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.
News October 23, 2024
2 రోజుల్లోనే ఖాతాల్లోకి గ్యాస్ డబ్బులు: TDP
AP: దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.