News March 29, 2025
జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్: చంద్రబాబు

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా. తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. ‘‘అన్న’’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రక రోజున ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 1, 2025
ఆరుబయట పడుకుంటున్నారా?

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
News April 1, 2025
స్కిన్ క్యాన్సర్తో బాధపడ్డా: జాన్ సీనా

WWE సూపర్స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
News April 1, 2025
ALERT: ఎండలు, పిడుగులతో వానలు

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <