News May 30, 2024
పల్నాడులో ఖైదీలకు జైళ్లు సరిపోవడం లేదు: ఎస్పీ మలికా గార్గ్

AP: ఎన్నికల ఖైదీలకు పల్నాడు జిల్లాలోని జైళ్లు సరిపోవడం లేదని SP మలికా గార్గ్ తెలిపారు. కొంతమందిని రాజమండ్రి జైలుకు పంపుతున్నట్లు చెప్పారు. ‘పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా వ్యాపిస్తోంది. పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని నా స్నేహితులు అడుగుతున్నారు. చెడు ఘటనలతో పల్నాడు పేరు మార్మోగడం బాధాకరం. కర్రలు, రాడ్లు పట్టుకుని తిరగడం అవసరమా’ అని ఆమె ప్రశ్నించారు.
Similar News
News April 4, 2026
టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

AP: SSC పరీక్షల్లో సందిగ్ధపు సమాధానాలున్న ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. HINDIలో 2, ENGLISHలో 5 మార్కులు కలవనున్నాయి. మరో 3ప్రశ్నలపైనా పేరెంట్స్ విన్నవించారు. కాగా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించాయి. సందిగ్ధం ఉన్న వాటిపై ప్రిన్సిపల్ వేల్యుయేషన్ సూచనలను DEOలకు పంపుతున్నట్లు తెలిపాయి.
News April 4, 2026
హార్ముజ్.. కొత్త రూట్ దొరికినట్లేనా?

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన మూడు భారీ నౌకలు తాజాగా సేఫ్గా బయటపడ్డాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక బిగ్ రిలీఫ్ అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలు ఇరాన్ నిఘా కన్నుగప్పి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్స్ను కాదని ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. దీంతో మిగిలిన దేశాలు కూడా ఇదే రూట్ను ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉంది.
News April 4, 2026
మహిళలను వేధించే వారిని ఉపేక్షించొద్దు: CBN

AP: మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారయత్న ఘటనలో నిందితుణ్ని త్వరగా అరెస్టు చేయాలని CM CBN పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని అధికారులు CMకు తెలిపారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బాధితురాలికి గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నామన్నారు.


