News December 8, 2024

రష్యా-ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి అవకాశాలు కనిపిస్తున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదల, ఆహారం, ద్రవ్యోల్బణం, ఎరువుల కొరత సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. Global Southలోని 125 దేశాల భావాలను భారత్ వినిపిస్తోందని, యూరోపియన్ నేతలు కూడా ఇరుదేశాల‌తో చర్చలు కొనసాగించాలని భారత్‌ను కోరారన్నారు. యుద్ధం కొనసాగింపు కంటే చర్చల వైపు పరిస్థితులు మారుతున్నట్లు చెప్పారు.

Similar News

News October 30, 2025

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.

News October 29, 2025

ఎల్లుండి నుంచి ఓటీటీలోకి 2 సినిమాలు

image

బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన కాంతార ఛాప్టర్-1, కొత్త లోక ఎల్లుండి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కాంతార ఛాప్టర్-1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘కొత్త లోక’ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్-1’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొత్త లోక’ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News October 29, 2025

NVIDIA సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి కంపెనీ

image

అమెరికన్ టెక్ కంపెనీ NVIDIA సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. $4 ట్రిలియన్ వాల్యూను చేరుకున్న 3 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. $500B విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని, US ప్రభుత్వం కోసం 7 సూపర్ కంప్యూటర్లు నిర్మిస్తున్నామని కంపెనీ CEO జెన్సెన్ హువాంగ్ చేసిన ప్రకటనతో షేర్లు భారీగా ఎగిశాయి.