News October 12, 2025
మా బౌలర్లను అంతలా బాదకు జైస్వాల్.. లారా రిక్వెస్ట్

భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో టెస్టులో 175 పరుగులతో వెస్టిండీస్ బౌలర్లను వణికించిన సంగతి తెలిసిందే. నిన్న ఆట ముగిసిన తర్వాత విండీస్ దిగ్గజ బ్యాటర్ లారా మైదానంలో యశస్వీని కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మా బౌలర్లను అంతలా బాదకు’ అని లారా వ్యాఖ్యానించగా.. ‘లేదు సర్. ట్రై చేస్తున్నా’ అని జైస్వాల్ అన్నారని BCCI <
Similar News
News October 12, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

ICC ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్తో మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మార్పులు చేయలేదు.
IND: ప్రతీకా, మంధాన, హర్లీన్, హర్మన్ప్రీత్ (C), జెమీమా, దీప్తి, రిచా, అమన్జోత్, రాణా, క్రాంతి, శ్రీ చరణి.
AUS: హేలీ(C), లిచ్ఫీల్డ్, పెర్రీ, మూనీ, సదర్లాండ్, గార్డనర్, మెక్గ్రాత్, మోలినక్స్, K గార్త్, అలానా, మేగాన్.
– స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.
News October 12, 2025
Op Sindoor: NSEపై ఒకేరోజు 40 కోట్ల సైబర్ అటాక్స్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)పై రోజూ 17కోట్ల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ టైమ్లో ఏకంగా ఒకేరోజు 40 కోట్ల దాడులు జరిగాయి. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని NSE వర్గాలు తెలిపాయి. తమ రెండు సైబర్ డిఫెన్స్ సెంటర్లలోని సాంకేతిక బృందాలు 24/7 పని చేస్తున్నట్లు చెప్పాయి. Op Sindoor సమయంలో తమ సైట్ను ఫారినర్స్ యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేశామన్నాయి.
News October 12, 2025
రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.