News July 21, 2024
‘జల’కళకళలాడుతున్న ప్రాజెక్టులు

AP: రాష్ట్రంలో ప్రాజెక్టులు ‘జల’కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్కు వరద వెల్లువెత్తుతోంది. శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. జూరాల నుంచి దీనిలోకి 97,208 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది.
Similar News
News October 25, 2025
ఏపీ రౌండప్

* బస్సు ప్రమాదం.. ఏపీకి చెందిన మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం
* డిగ్రీ 3వ విడత ప్రవేశాలు.. ఈ నెల 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 25-27న వెబ్ ఆప్షన్లకు అవకాశం, NOV 1న సీట్ల కేటాయింపు
* ఖరీఫ్ ధాన్యం సేకరణకు రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్ఫెడ్కు ప్రభుత్వం హామీ
* అమరావతిలో RBI రీజనల్ ఆఫీసు.. నేలపాడులో 3 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం
News October 25, 2025
అయోధ్య దర్శన వేళల్లో స్వల్ప మార్పులు

అయోధ్య బాల రాముడి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై రాత్రి 8.30గం. వరకే దర్శనానికి అనుమతించనున్నారు. శీతాకాలం దృష్ట్యా అరగంట కుదించామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. మంగళహారతిని తెల్లవారుజామున 4గం.కు బదులు 4.30కి, శృంగార హారతిని 6కు బదులుగా 6.30గం.కు, శయన హారతిని రాత్రి 10గం.కు బదులు 9.30కి నిర్వహిస్తారు. దర్శనాలు యథావిధిగా ఉదయం 7 గం.కు మొదలవుతాయి.
News October 25, 2025
నేటి నుంచి కవిత ‘జాగృతి జనం బాట’

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’లో పాల్గొననున్నారు. ఉ.9.30 గంటలకు HYD గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతారు. అక్కడ నుంచి మ.ఒంటి గంటకు నిజామాబాద్లోని ఇందల్వాయి టోల్ గేట్కి చేరుకున్నాక ఆమెకు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. 4 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ యాత్రలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో ఆమె భేటీ కానున్నారు.


