News January 8, 2025
జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్

జమిలి ఎన్నికలపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జమిలి ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆర్థిక సాధ్యాసాధ్యాలు, అవసరమైన ఈవీఎంలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల్ని జమిలి ఎన్నికలు ఉల్లంఘిస్తాయని ప్రియాంక పేర్కొన్నట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్లో కైఫ్ దూకుడు, బౌలింగ్లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.
News January 21, 2026
‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CBN

AP: అగ్రిటెక్ విధానం అమలుతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని CBN తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతాను. విశాఖకు గూగుల్ సంస్థ రాక గొప్ప ముందడుగు. దీని కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డారు. గ్రీన్ ఎనర్జీ, అమ్మోనియా గురించి లోకం చర్చిస్తున్న సమయంలో AP ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతున్నాం’ అని దావోస్లో మీడియాతో పేర్కొన్నారు.
News January 21, 2026
మిర్చికి రికార్డ్ స్థాయిలో ధర

గుంటూరు మిర్చి మార్కెట్లో ఇవాళ రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. యార్డుకు 46 వేల బస్తాల సరకు రాగా, అన్ని రకాలకు మంచి ధర లభించింది. ముఖ్యంగా 2043 రకం క్వింటాలుకు రూ.30,000( ఏసీ సరుకు క్వింటాల్ రూ.35,000) వరకు రికార్డు స్థాయి ధర పలికింది. మిరప 341 రకం గరిష్ఠంగా క్వింటాకు రూ.25,000, నెంబర్ 5 రకం రూ.22,000-23,000, బంగారం, బుల్లెట్ రకాలు రూ.21,000-22,000, తేజ రకం రూ.19,500-20,000 వరకు ధర పలికాయి.


