News December 9, 2024
జమిలి ఎన్నికలు: ఈ సమావేశాల్లోనే బిల్లు!

జమిలి ఎన్నికల నిర్వహణకు NDA ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే సభ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
Similar News
News December 1, 2025
ఆఫీసు వర్క్ కంటే పేరెంటింగ్తోనే అధిక ఒత్తిడి

బయటకు వెళ్లి పనులు చేయడం, జాబ్ చేయడం కంటే పిల్లలతో ఇంట్లో ఉండటం ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. ఇంటి పనుల్లో బ్రేక్ లేకపోవడం, సోషల్ ఇంటరాక్షన్ తక్కువ, మెంటల్ లోడ్ ఎక్కువవడం దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందంటున్నారు. సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఈ ఒత్తిడి వల్ల వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
News December 1, 2025
ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.


