News December 14, 2024
జమిలి ఎన్నికలు 2029లోనే: చంద్రబాబు

AP: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయని CM చంద్రబాబు అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్కు తమ పూర్తి మద్ధతు ఉంటుందని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం నడుస్తోంది. విజన్-2020లాగే విజన్-2047 కూడా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం చేపడుతున్నాం. అవగాహన లేకే YCP జమిలి ఎన్నికలపై ఏది పడితే అది మాట్లాడుతోంది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News March 3, 2026
మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్కు వ్యాపించింది. US-ఇజ్రాయెల్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అండగా నిలిచాయి. ఇరాన్కు సాయం చేస్తామని చైనా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్లో మొదలైన యుద్ధం Asia, europe దేశాలకు పాకి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోగా నిత్యావసరాలపైనా వార్ ఎఫెక్ట్ పడుతుందేమోనని సామాన్యుడిలో ఆందోళన నెలకొంది.
News March 3, 2026
ఉస్తాద్ భగత్సింగ్ పేరు అందుకే మార్చాం: హరీశ్ శంకర్

ఉస్తాద్ భగత్సింగ్ సినిమా టైటిల్ను తొలుత ‘భవదీయుడు భగత్సింగ్’ అనుకున్నట్లు డైరెక్టర్ హరీశ్ శంకర్ వెల్లడించారు. కానీ, ఆ పేరు SMలో లీకై ‘భవదీయుడు’ అంటే అర్థం ఏంటని GenZల నుంచి సందేహాలు వచ్చాయన్నారు. పేరు అర్థం కాకపోతే ఎలా అని ఆలోచించి ఉస్తాద్ భగత్సింగ్ ఖరారు చేసినట్లు చెప్పారు. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశామనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. అలాగే ఈ సినిమా రీమేక్ కాదని మరోసారి స్పష్టం చేశారు.
News March 3, 2026
హార్ముజ్లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఏ ఓడ వచ్చినా తగలబెట్టేస్తామని IRGC హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం నుంచే వెళ్తుంది. వాస్తవానికి ఇరాన్ దాడుల భయంతో మార్చి 1 నుంచే ఈ మార్గం నుంచి షిప్పులు వెళ్లడం లేదు. మరోవైపు కువైట్లో ఉన్న పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికన్ మిలిటరీ బేస్పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది.


