News December 24, 2024

జ‌న‌వ‌రి 8న ‘జ‌మిలి జేపీసీ’ భేటీ

image

జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఏర్పాటైన సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీ తొలిసారిగా Jan 8న భేటీ కానుంది. లోక్‌స‌భ, రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఏక‌కాలంలో ఎన్నిక‌లు నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయ బిల్లును కేంద్రం గ‌త వారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. జేపీసీ తొలి స‌మావేశంలో అధికారులు ఈ రెండు బిల్లుల‌పై స‌భ్యుల‌కు వివ‌రించ‌నున్నారు. JPCలో 39 మంది సభ్యులున్నారు.

Similar News

News November 13, 2025

మార్నింగ్ అప్డేట్స్

image

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.

News November 13, 2025

టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

image

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్‌లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్‌లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.