News January 30, 2025

JAN 31న పాఠశాలలకు సెలవు :ASF కలెక్టర్

image

నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జాతరకు పిల్లలు వెళ్లాలని ఆయన కోరారు.ఇందుకు బదులుగా మార్చి 8వ తేదీ 2వ శనివారం రోజు పాఠశాలలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

image

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

News October 31, 2025

సిరిసిల్ల: మిగిలి ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్

image

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతుల నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ తెరిసా తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 4న ఉదయం 11 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాజరుకావాలని ఆమె కోరారు.

News October 31, 2025

ఆ మందు లేదన్నందుకు వైన్‌షాప్‌ క్యాషియర్‌పై దాడి

image

ఖమ్మం: ఆ మద్యం బ్రాండ్(రాయల్ స్ట్రాంగ్) ఇవ్వలేదన్న కోపంతో వైన్ షాప్ క్యాషియర్‌పై యువకులు దాడి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో పనిచేసే పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌పై ఐదుగురు యువకులు తనకు నచ్చిన మధ్యం ఇవ్వాలని అడిగారు. అది లేదనడంతో కోపంతో డాడికి పాల్పడ్డారు. దాడి వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.