News January 30, 2025
JAN 31న పాఠశాలలకు సెలవు :ASF కలెక్టర్

నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జాతరకు పిల్లలు వెళ్లాలని ఆయన కోరారు.ఇందుకు బదులుగా మార్చి 8వ తేదీ 2వ శనివారం రోజు పాఠశాలలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
హైదరాబాద్ బిర్యానీ తగ్గేదేలే!

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే బెస్ట్ ఫుడ్ జాబితాలో HYD బిర్యానీ ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఫుడ్ గైడ్ టెస్ట్ అట్లాస్ జాబితా ‘50 ఉత్తమ బియ్యం వంటకాలు- 2025’లో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో ఇది వెల్లడైంది. మొదటి 9స్థానాల్లో నెగిటోరోడాన్, సూషి, కైసెండన్, ఒటోరో నిగిరి, చుటోరో నిగిరి, నిగిరి, మాకి నిలిచాయి. ఇంతకీ HYDలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది.
News November 27, 2025
KNR: ‘వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి.’

కరీంనగర్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన TMKMKS రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి గురువారం గోరింకల నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తె.మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ హాజరై మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
News November 27, 2025
ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పౌరసరఫరాల అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, గోనెసంచులు తదితర అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


