News March 19, 2025
మరింత బాధ్యతగా పని చేసేలా జనసేన అడుగులు: పవన్

AP: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.
Similar News
News January 28, 2026
వారసుడిని ప్రకటించే పనిలో ఇరాన్ సుప్రీం లీడర్

USA యుద్ధనౌకలు సమీపించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వారసుడిని నిర్ణయించే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే బంకర్లో దాక్కున్న ఆయన, USకు పట్టుబడ్డా, అంతమైనా పాలన ఆగకుండా ముగ్గురి పేర్లు షార్ట్ లిస్ట్ చేశారని తెలుస్తోంది. ఇందులో తన కొడుకు మొజ్తబా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఫౌండర్ మనవడు రుహొల్లా తదితర పేర్లు విన్పిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఠమెక్కే ఎవరికైనా పాలన కత్తుల వంతెనపై కవాతే.
News January 28, 2026
ఫ్రీగా AI సర్టిఫికేషన్ కోర్స్

విద్యార్థులు, టీచర్లకు జియో సంస్థ AIపై 4 వారాల ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించింది. గూగుల్ జెమిని ప్రో భాగస్వామ్యంతో ఈ ట్రైనింగ్ను రూపొందించారు. ఇప్పటికే AP, TGలో పలువురు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. <
News January 28, 2026
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం: PTI

అవినీతి ఆరోపణలతో మూడేళ్లుగా జైలులో మగ్గుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<18620748>>ఆరోగ్యంపై<<>> PTI పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. కోర్టు ఆర్డర్లనూ జైలు సిబ్బంది పట్టించుకోవట్లేదని మండిపడింది. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.


