News March 17, 2024
జనగామ: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.
Similar News
News August 21, 2025
WGL: రైల్వే స్టేషన్లో గోడను ఢీకొన్న గూడ్స్ రైల్

వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం ప్రమాదం సంభవించింది. వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ గూడ్స్ రైలు రివర్స్ వస్తూ రైల్వే స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడను తగిలింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, ఎవరికీ ఏం కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
News August 21, 2025
వరంగల్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 9154252936లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
News August 20, 2025
వరంగల్ జిల్లాలో తగ్గిన వర్షాలు

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంగెంలో 18.4, నెక్కొండ 15.1, పర్వతగిరి 13.8 మి.మీ. వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 12.3, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేటలో 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. తక్కువగా వరంగల్ పట్టణంలో 2.4 మి.మీ. వర్షం నమోదైంది.