News December 28, 2024

జనంలోకి జనసేనాని

image

AP: కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, స్థితిగతులను నేరుగా ఆయనే తెలుసుకోనున్నారు. త్వరలోనే పర్యటన షెడ్యూల్, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News November 16, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 16, 2025

AP న్యూస్ రౌండప్

image

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ

News November 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

image

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>