News November 12, 2024
పోసానిపై ఎస్పీకి జనసేన నేతల ఫిర్యాదు

AP: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి జనసేన నేతలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతో కోర్టుకు వెళ్లామని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం: మంత్రి పొన్నం

రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. 10 రోజుల వ్యవధిలో కొత్తగా ఏర్పడిన బృందాల ద్వారా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసుల నమోదు చేశారన్నారు.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


