News January 6, 2025
జనవరి 06: చరిత్రలో ఈరోజు

* 1847: వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం
* 1852: అంధులకు బ్రెయిలీ లిపి రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం
* 1929: కోల్కతాలో పేదలకు, రోగులకు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మదర్ థెరిసా
* 1959: భారత మాజీ క్రికెటర్ కపిల్దేవ్ పుట్టినరోజు
* 1966: మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ బర్త్డే
Similar News
News September 14, 2025
VJA: లేపాక్షి ప్రదర్శనలో విద్యార్థుల సరికొత్త ఆలోచనలు

విజయవాడలోని లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ, మాస్టర్ పీసెస్ ఎగ్జిబిషన్లో యువ డిజైనర్ల ఆలోచనలు ప్రతిధ్వనించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది విద్యార్థులు సాంప్రదాయ హస్తకళలను లోతుగా అధ్యయనం చేశారు. టెక్స్టైల్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్ వంటి విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలోని కళాఖండాలను పరిశీలించి, డిజైన్, నాణ్యత, వినియోగం, ప్రజెంటేషన్ అంశాలపై విశ్లేషణ చేశారు.
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
News September 14, 2025
ఇవాళ అస్సాం, రేపు ప.బెంగాల్లో PM పర్యటన

PM మోదీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ అస్సాంలో రూ.18,530 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంటును ప్రారంభిస్తారు. రేపు PM ప.బెంగాల్లో పర్యటిస్తారు. కోల్కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025లో పాల్గొంటారు. ఆ తర్వాత బిహార్ వెళ్లి పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రారంభిస్తారు.