News October 27, 2024
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. UPDATE
TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 27, 2024
ఫాంహౌస్ పార్టీ.. DGPకి కేసీఆర్ ఫోన్
TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News October 27, 2024
సింగిల్స్కు ఫ్రీ వాటర్ బాటిల్స్.. ఎందుకంటే?
పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్ మ్యూజిక్ లవర్స్ను ఉర్రూతలూగించింది. కన్సర్ట్లో సింగిల్స్కు ఓ మ్యాట్రిమొనీ వాలంటీర్లు ‘సింగిల్స్ కో పానీ పిలావో యోజన’ పేరుతో ఫ్రీ వాటర్ బాటిల్స్ అందించారు. ‘మా మ్యాట్రిమొనీలో చేరి ఉంటే ఈ బాటిల్కు బదులుగా మీ భాగస్వామి చేతులు పట్టుకుని ఉండేవారు’ అని ప్రమోషన్స్ చేశారు. ఫ్రీ బాటిల్స్ అందుకున్న సింగిల్స్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
News October 27, 2024
BREAKING: కదులుతున్న రైలులో మంటలు!
మధ్యప్రదేశ్లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.