News April 2, 2024
భారతీయులకు జపాన్ ఈ-వీసాలు

భారతీయ పర్యాటకులకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది జపాన్ ప్రభుత్వం. భారతీయులు సహా భారత్లో నివసించే విదేశీయులకు ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రక్రియ నిన్నటి నుంచి అమలైంది. VFX గ్లోబల్ నిర్వహించే అప్లికేషన్ సెంటర్ల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో వీసా మంజూరు అవుతుందట. ఫోన్కు వచ్చే ‘వీసా ఇష్యూయెన్స్ నోటీసు’ను ఎయిర్పోర్టు సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది.
Similar News
News January 21, 2026
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: కవిత

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News January 21, 2026
సునీతా విలియమ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. 1998లో నాసాలో చేరిన ఆమె మొత్తం మూడుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తొమ్మిదిసార్లు స్పేస్వాక్ చేశారు.
News January 21, 2026
173 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(<


