News August 9, 2024
సిల్వర్ మెడల్తో బల్లెం వీరుడు

పారిస్ ఒలింపిక్స్2024లో భారత్ తొలి సిల్వర్ మెడల్ అందుకుంది. నిన్న అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఆ మెడల్ను తాజాగా ప్రదానం చేశారు. మెడల్తో నీరజ్ ఫొటోలకు పోజులిచ్చారు. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్కు గోల్డ్, మూడో స్థానంలో నిలిచిన గ్రెనెడా అథ్లెట్ పీటర్సన్కు బ్రాంజ్ మెడల్ వచ్చింది.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<
News November 24, 2025
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. విదేశీయులకు గుడ్న్యూస్

విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ 2009లో తెచ్చిన పౌరసత్వ చట్టంలో కెనడా సవరణ చేసింది. కొత్త చట్టం ద్వారా విదేశాల్లో పుట్టిన కెనడియన్లూ తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసే ఛాన్స్ ఉండేలా మార్పులు చేస్తూ బిల్ సీ-3 తెచ్చింది. బిడ్డల్ని కనే ముందు 1075 రోజులు కెనడాలోనే ఉన్నట్లు ప్రూఫ్ చూపాలి. పాత చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కెనడియన్ కోర్టు కొట్టేసింది.


