News June 6, 2024
సెలవుపై జవహర్ రెడ్డి

AP: సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సాయంత్రంలోగా కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవు పెట్టారు.
Similar News
News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.
News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.
News November 18, 2025
కొండెక్కిన ‘కోడిగుడ్డు’

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.


