News January 31, 2025
జయలలిత ఆస్తి రూ.4వేల కోట్లు.. అంతా TN ప్రభుత్వానికే

దివంగత సీఎం జయలలిత ఆస్తిని ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక పరిధిలో ఉన్న 1,562 ఎకరాల భూమి, 27 కేజీల బంగారం, 10వేల చీరలు, 750 జతల చెప్పులు, వాచ్లను అధికారులు అప్పగించనున్నారు. పదేళ్ల కిందట ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు కాగా, ఇప్పటి మార్కెట్ విలువ రూ.4వేల కోట్లపైనే అని అంచనా.
Similar News
News December 3, 2025
‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.
News December 3, 2025
నేడు హుస్నాబాద్లో సీఎం పర్యటన

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.
News December 3, 2025
నేడు హుస్నాబాద్లో సీఎం పర్యటన

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.


