News June 27, 2024
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా

శ్రీలంక జాతీయ జట్టుతో పాటు అండర్-19, శ్రీలంక-ఏ జట్ల కన్సల్టెంట్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రిజైన్ చేశారు. కారణాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. టీ20 WCలో శ్రీలంక పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన ఆ పదవిలో ఉన్నారు. వరల్డ్ కప్లో శ్రీలంక లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News November 27, 2025
HNK టౌన్హాల్కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్హాల్కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


