News January 18, 2025

JC ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవీలత

image

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందచేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News February 16, 2025

JNTUలోని మెకానికల్ ప్రొఫెసర్లను అభినందించిన ప్రిన్సిపల్

image

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కళ్యాణి రాధ, ఓం ప్రకాశ్‌ను శనివారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. NIT-Rలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో వారు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ మీద వారికి NIT-R నుంచి సర్టిఫికెట్, అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

News February 15, 2025

ఈనెల 17న రాయదుర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఫిబ్రవరి 17న రాయదుర్గం పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు ఏపిడి డ్వామా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

News February 15, 2025

వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ ముందుకు: మంత్రి

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అనంతపురంలో మేధావులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్​ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయింపులు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనను సమన్వయం చేసుకుంటూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

error: Content is protected !!