News February 16, 2026
JEE మెయిన్స్లో కడప జిల్లా యువకుడి సత్తా

JEE మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన డెంటల్ డాక్టర్ కిరణ్కుమార్ కుమారుడు పసల మోహిత్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. అతనికి 300కి 300 మార్కులతో 100% వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పసల మోహిత్, OBC కేటగిరీలో నరేంద్ర బాబుకి, SC కేటగిరీలో దేవశ్రీ వేద్లకు 100% లభించింది. మోహిత్కు మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందించారు.
Similar News
News February 17, 2026
మ.1.30 గం. వరకే స్కూళ్లు

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
News February 17, 2026
TDR బ్యాంక్@2026.. కాగితం ముక్క ఇక కరెన్సీ నోటుతో సమానం!

మూసీ బాధితులకు ఇచ్చే TDR బాండ్ల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ బాండ్లను బాధితులు బిల్డర్లకు అమ్ముకోవాల్సి వచ్చేది. అక్కడ వాళ్లు మోసపోయే అవకాశం ఉండేది. దీనికి చెక్ పెడుతూ సర్కారే ఒక ‘డిజిటల్ TDR ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయబోతోంది. ఇది పారదర్శకతను పెంచుతుందని చెప్తున్నా మార్కెట్ రేటును ప్రభుత్వం నియంత్రించడం వల్ల బాధితులకు ఆశించిన ధర దక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.
News February 17, 2026
TDR బ్యాంక్@2026.. కాగితం ముక్క ఇక కరెన్సీ నోటుతో సమానం!

మూసీ బాధితులకు ఇచ్చే TDR బాండ్ల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ బాండ్లను బాధితులు బిల్డర్లకు అమ్ముకోవాల్సి వచ్చేది. అక్కడ వాళ్లు మోసపోయే అవకాశం ఉండేది. దీనికి చెక్ పెడుతూ సర్కారే ఒక ‘డిజిటల్ TDR ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయబోతోంది. ఇది పారదర్శకతను పెంచుతుందని చెప్తున్నా మార్కెట్ రేటును ప్రభుత్వం నియంత్రించడం వల్ల బాధితులకు ఆశించిన ధర దక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.


