News April 25, 2024
JEE మెయిన్స్లో వాడపాలెం విద్యార్థికి జాతీయ RANK

JEE మెయిన్స్ పరీక్షల్లో డా.బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు గంటి జడ్పీ హైస్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 13, 2025
గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..?

తూ.గో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఎస్సీ వర్గానికి చెందిన జవహర్ ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ, బీజేపీ బీసీలకు, జనసేన కాపు వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న ఇస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.