News March 11, 2025

జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

image

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.

Similar News

News December 29, 2025

చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి?

image

శివాలయాల్లో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి ఎడమ వైపుగా అభిషేక జలం బయటకు వచ్చే ‘సోమసూత్రం’ వరకు వెళ్లాలి. ఆ నీటిని దాటకుండా, తిరిగి వెనక్కి వస్తూ ధ్వజస్తంభాన్ని చేరుకోవాలి. ఆపై కుడి వైపుగా సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి. ఇలా ఓసారి పూర్తి చేస్తే ఓ చండీ ప్రదక్షిణ అవుతుంది. సోమ సూత్రం దాటకుండా చేసే ఈ ప్రదక్షిణ అతి శక్తిమంతమైనది.

News December 29, 2025

నేటి నుంచి అసెంబ్లీ.. ‘జల’ జగడమేనా?

image

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. <<18695816>>KCR<<>> రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది. కాగా ఇవాళ సభలో మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, GHMC చట్ట సవరణ బిల్లులను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు.

News December 29, 2025

సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

image

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.