News March 11, 2025

జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

image

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.

Similar News

News December 19, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్: ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’

image

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ <<18547375>>ఎస్టేట్‌<<>>లోని మరిన్ని ఫొటోలను US హౌస్‌ డెమొక్రాట్ల కమిటీ రిలీజ్ చేసింది. మొత్తం 68 ఫొటోల్లో బిల్ గేట్స్, నోవమ్ చోమ్‌స్కీ, వూడీ అలెన్ వంటి వాళ్లు ఉన్నారు. ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’ అంటూ ఉన్న మెసేజీలు, పేర్లు బ్లర్ చేసిన రష్యా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాల మహిళల పాస్‌పోర్టులూ ఉన్నాయి. కమిటీ వద్ద మొత్తం 95 వేల ఇమేజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

News December 19, 2025

AIIMS బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు

image

AIIMS బిలాస్‌పుర్ 68 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, BDS ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.56,100+అలవెన్సులు చెల్లిస్తారు. డిసెంబర్ 23న రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in

News December 19, 2025

MLAల ఫిరాయింపు: నేడు సుప్రీంలో విచారణ

image

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు గడువు నేపథ్యంలో ఐదుగురికి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం వెల్లడించారు. కడియం, దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. తమ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపిస్తున్న తరుణంలో స్పీకర్ అనూహ్య నిర్ణయంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.