News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
Similar News
News January 12, 2026
అత్తారింటికి కొత్తగా వెళ్తున్న కోడలు పాటించాల్సిన నియమాలు..

నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి 6 నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో కోడలు ఓర్పుతో ఉండాలి. కుటుంబీకుల అలవాట్లను గమనిస్తూ వారితో మమేకం కావాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఇష్టదైవానికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఈ నియమం బాధ్యతలకే పరిమితం కాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, సామరస్యంగా జీవించడమే ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.
News January 12, 2026
పంట వ్యర్థాలను ఇలా వాడుకోవడం ఉత్తమం

పంట వ్యర్థాలను పశువుల మేతగా, మల్చింగ్ పదార్థంగా వాడాలి. మల్చింగ్ వల్ల నేలలో తేమను పరిరక్షించవచ్చు. కంపోస్ట్ , బయోగ్యాస్, ఇథనాల్ తయారీ, పుట్టగొడుగుల పెంపకం, బయోచార్ తయారీలో వరి పంట కోత తర్వాతి వ్యర్థాలను వాడుకోవచ్చు. పంట అవశేషాల్లోని నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇతర సూక్ష్మపోషకాలు భూమికి, పంటకు మేలు చేస్తాయి. అందుకే భూసారం పెరగడానికి, పర్యావరణ పరిరక్షణకు పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ఉత్తమం.
News January 12, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయి 83,135 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు నష్టపోయి 25,555 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, ఎటర్నల్, రిలయన్స్, బెల్, ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


