News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
Similar News
News January 12, 2026
ఇరాన్లో ఇండియన్స్ అరెస్ట్.. స్పందించిన ఆ దేశ రాయబారి

ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక <<18832503>>అల్లర్లలో<<>> ఇండియన్స్ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల్ని భారత్లోని ఆ దేశ రాయబారి మహమ్మద్ ఫథాలీ ఖండించారు. వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇరాన్కు సంబంధించిన అప్డేట్స్ కోసం అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని సూచించారు.
News January 12, 2026
PSLV-C62 ప్రయోగం

AP: ఇస్రో PSLV-C62 ప్రయోగం ప్రారంభమైంది. నిర్దేశిత సమయం ప్రకారం 10.18 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా అడ్వాన్స్డ్ భూపరిశీలన ఉపగ్రహం EOS-N1 సహా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను పంపారు. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.
News January 12, 2026
వెనిజులాను ట్రంప్ ఏం చేయబోతున్నారు?

వెనిజులాను ఉద్ధరిస్తానన్న US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తానే ఆ దేశానికి యాక్టింగ్ <<18833003>>ప్రెసిడెంట్<<>> అని ప్రకటించుకున్నారు. డ్రగ్స్ను బూచిగా చూపించి ఆయిల్ కంపెనీలను గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన కంపెనీలకే చమురు సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తన చెప్పుచేతల్లో ఉండాలన్నారు. తాజా ప్రకటనతో ట్రంప్ ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


