News March 11, 2025

జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

image

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.

Similar News

News December 14, 2025

సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే.. ఎంతో ఆరోగ్యం

image

మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం ‘సూర్యుడు’. ఆయనకు రోజూ అర్ఘ్యం సమర్పించడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. కంటి చూపు మెరుగవడంతో పాటు ఆలోచనల్లో గందరగోళం తగ్గి, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. సూర్య కిరణాల ప్రభావంతో శరీరంలో ఉత్సాహం పెరిగి, ఆధ్యాత్మిక, శారీరక బలం చేకూరుతుందని చెబుతున్నారు. అర్ఘ్యం ఎలా సమర్పించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 14, 2025

బీట్‌రూట్‌తో చిన్నారులకు మేలు

image

పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్‌రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్‌, ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియంతో పాటు విటమిన్‌ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని చేర్చాలని చెబుతున్నారు.

News December 14, 2025

లంపీ స్కిన్.. పశువు శరీరంపై గాయాలకు మందు తయారీ

image

గుప్పెడు కుప్పింటు ఆకులు, గుప్పెడు వేపాకులు, గుప్పెడు గోరింటాకు, గుప్పెడు తులసి ఆకులు, పది పాయల వెల్లుల్లి, 10గ్రాముల పసుపు పౌడర్, 500మి.లీ. కొబ్బరి నూనె, గుప్పెడు సీతాఫలం ఆకులు, 10 గ్రాముల కర్పూరం తీసుకోవాలి. కొబ్బరి నూనె వదిలేసి మిగతాది మెత్తని మిశ్రమంలా చేసి దాన్ని 500ml నూనెలో మరిగించి చల్లార్చాలి. పశువు శరీరంపై గాయాలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత తయారు చేసిన మిశ్రమాన్ని గాయంపైన రాయాలి.