News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
Similar News
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
News December 14, 2025
100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు: TTD

AP: దేశంలో తొలిసారిగా ఆధ్యాత్మికత, పర్యావరణ పెంపు లక్ష్యంతో 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘హిందూ ఆలయాల్లో ధ్వజ స్తంభాలకు అవసరమైన టేకు, ఏగిశ, కినో, టెర్మినేలియా, షోరియా జాతి వృక్షాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా TTD ఆధ్వర్యంలో ప్రస్తుతం 60 ఆలయాలున్నాయి. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని ఆలయాలు నిర్మించనున్నాం’ అని తెలిపారు.
News December 14, 2025
ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. కామారెడ్డి (D) గాంధారి (M) పొతంగల్ఖుర్ద్లో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సంతోష్కు 278 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం (D) అశ్వారావుపేట (M) పాత రెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఉమ్మలా వెంకటరమణ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.


