News May 19, 2024

జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల

image

JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలను NTA విడుదల చేసింది. ఈ రిజల్ట్స్‌ను https://jeemain.nta.ac.in./ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ పేపర్‌లో ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్, కర్ణాటకకు చెందిన అరుణ్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఆర్కిటెక్చర్‌ పేపర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన సులగ్న బాసక్, తమిళనాడుకు చెందిన ఆర్.ముత్తు 100 ఎన్టీఏ స్కోర్ పొందారు.

Similar News

News October 17, 2025

తిన్న వెంటనే నడుస్తున్నారా?

image

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it

News October 17, 2025

మంత్రి లోకేశ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

image

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్‌ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.

News October 17, 2025

పిల్లలను స్కూల్‌కు పంపేందుకు ఇంత కష్టపడుతున్నారా?

image

పిల్లలను తయారుచేసి బడికి పంపే సమయంలో మనం చేసే హడావిడి.. మారథాన్‌లో పరిగెత్తడానికి సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు 3,000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. పిల్లలను బట్టలు వేసుకోమని బతిమాలడం, అరవడంలో తల్లిదండ్రులు ఖర్చుచేసే శక్తి ‘మారథాన్‌లో పరుగెత్తడం, కోపంగా ఉన్న ఎలుగుబంటితో పోరాడినంత పనే’ అని ప్రొఫెసర్ ఓలాన్ విచ్ వివరించారు. మీరూ ఇలా కష్టపడతారా?