News April 4, 2024
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరగనుండగా, దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు, ఫొటో ఐడీ ప్రూఫ్ ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతించనున్నారు.
* ALL THE BEST
Similar News
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.
News November 18, 2025
ఇవాళ భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.


