News November 22, 2024
JEE MAIN: నేడే లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్-2025 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇవాళ రా.9 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రా.11.50 వరకు ఫీజు చెల్లించవచ్చని NTA తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్ష జరగనుంది. ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది.
వెబ్సైట్: jeemain.nta.nic.in
Similar News
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News October 26, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి 10 వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం 10రోజుల్లోగా దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్ను స్పీడ్ పోస్ట్ చేయాలి. కన్సల్టెంట్, సీనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజినీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: aiimsmangalagiri.edu.in
News October 26, 2025
గ్యాస్ గీజర్లు వాడుతున్నారా?

కర్ణాటకలోని బెట్టపురలో బాత్రూమ్లో గీజర్ నుంచి లీకైన LPG గ్యాస్ పీల్చడంతో అక్కాచెల్లెళ్లు గుల్ఫామ్, తాజ్ చనిపోయారు. అలాంటి గీజర్లు వాడే వారికి ఈ ఘటన ఒక వేకప్ కాల్ అని నిపుణులు అంటున్నారు. మీరు గ్యాస్ గీజర్లు వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ‘యూనిట్ను బాత్రూమ్లో కాకుండా బయటి ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయించాలి. తరచూ గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి. వాడనప్పుడు ఆఫ్ చేయాలి’ అని సూచిస్తున్నారు.


