News June 16, 2024

ఐస్‌క్రీమ్‌లో జెర్రి

image

ఇటీవల మహారాష్ట్రలో ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు కనిపించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీపాదేవి తన కొడుకు కోసం బ్లింకిట్‌లో అమూల్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే బ్లింకిట్‌కు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీమ్ ధర రూ.195ను ఆమెకు రీఫండ్ చేసింది. విషయాన్ని అమూల్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

Similar News

News October 14, 2025

జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

image

YS జగన్‌కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్‌లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.

News October 14, 2025

సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

image

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it

News October 14, 2025

ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

image

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>