News October 14, 2024

సీఐడీకి జెత్వానీ కేసు

image

AP: ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.

Similar News

News November 10, 2025

HYDలో అలర్ట్.. విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో RPF, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు CISF దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

News November 10, 2025

CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

image

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.

News November 10, 2025

మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

image

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.