News July 5, 2025

JGTL: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన పోలీసులు

image

మంచిర్యాల్ జిల్లా చున్నంబట్టివాడకు చెందిన కొమిరి రజిత కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాల (D) ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చిన రజిత బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు స్పందించి సమయస్ఫూర్తితో అడ్డుకొని ఆమెను కాపాడారు.

Similar News

News July 5, 2025

MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

image

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 5, 2025

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

image

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News July 5, 2025

అమలాపురం: విపస్యాన ధ్యాన పద్ధతిపై కలెక్టర్ సూచనలు

image

పని ఒత్తిడిని అధిగమించి మనశ్శాంతిని సాధించడానికి విపస్యాన ధ్యాన పద్ధతి సరైనదని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శనివారం విపస్యాన ధ్యాన కార్యక్రమంపై ఎంఈఓలు, హెచ్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలలలో పిల్లలకు వయసు వారీగా విపస్యాన ధ్యాన కార్యక్రమాల నిర్వహణపై ఆయన వారికి సూచనలు చేశారు.