News February 24, 2026

JGTL: ఇది పరీక్ష కాలం.. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 15,125 మంది ఉన్నారు. ఇందులో 1st ఇయర్లో 7,699 ఉండగా, 2nd ఇయర్లో 7426 ఉన్నారు. వీరి కోసం జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలను, 12 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసామని, విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందు సెంటర్ కు చేరుకోవాలని కోరారు.

Similar News

News February 25, 2026

‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

image

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.

News February 25, 2026

గుంటూరు వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్‌ను సంప్రదించాలన్నారు.

News February 25, 2026

రాష్ట్ర సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జట్టుకు ద్వితీయ స్థానం

image

వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.