News December 23, 2025
JGTL: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు CCLలు మంజూరు

పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు 2 రోజుల CCLలు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డిసెంబర్ 13, 14 తేదీలకు రెండు CCLలు వర్తిస్తాయని DEO కె.రాము తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు హాజరు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉపాధ్యాయులకు సంబంధిత MEO, HMలు CCLలను ప్రిజర్వ్ చేయాలని సూచించారు.
Similar News
News December 24, 2025
అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.
News December 24, 2025
మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్గఢ్లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.


