News October 15, 2025
JGTL: కనీస మద్దతు ధరల గోడ పత్రిక ఆవిష్కరణ

పండించిన పంటలకు రైతులు కనీస మద్దతు ధర పొందేలా కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల కనీస మద్దతు ధరల గోడ పత్రికను ఆయన బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ట్రైనీ అదనపు కలెక్టర్ కన్నం హరిణి, డీఆర్డీవో రఘువరన్, డీసీవో మనోజ్ కుమార్, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఆర్టివో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
దుబాయ్లో సిరిసిల్ల యువకుడి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.
News October 15, 2025
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం

విజయవాడలో బుధవారం స్టెరాయిడ్స్ కలకలం రేగింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్ను సుమారు 10 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2025
అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.