News August 9, 2025
JGTL: తండ్రి సమాధికి రాఖీ కట్టిన కుమార్తె

గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన తన తండ్రి రాజయ్య సమాధికి రాఖీ కట్టి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసింది. రెండేళ్ల క్రితం రాజయ్య హఠాన్మరణం చెందారు. ఏటా తన తండ్రికి కూతురు రాఖీ కట్టడానికి వెళ్లేది. తండ్రి భౌతికంగా లేకపోవడంతో సమాధి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. తద్వారా రక్షాబంధన్కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.
Similar News
News August 10, 2025
భువనగిరి: ‘ఆ రోజుల్లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు’

సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈనెల 19 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
News August 10, 2025
NRPT: ‘సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. పెరుగుతున్న అధునాతన టెక్నాలజీ వాడుకొని సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయకూడదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్ చెప్పకూడదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
News August 10, 2025
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం: కోదాడ MLA

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడలో చిరంజీవి యూత్ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండె పంగు రమేశ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.