News December 30, 2025
JGTL: పాపం.. ఉపాధ్యాయులకు ’పరీక్షా’కాలం

2011కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ గండంగా మారింది. అయితే జనవరి 3- 9వరకు నిర్వహించే టెట్ పరీక్షకు జిల్లాకు చెందిన టీచర్లకు సుమారు 300- 400 కి.మీ.ల దూరంలోగల ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సెంటర్ వేయడంతో దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే అంత దూరం వెళ్లలేక పరీక్షను రాయడానికి సుముఖత చూపట్లేదు.
Similar News
News December 30, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
News December 30, 2025
ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.
News December 30, 2025
రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2004లో కోడూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


