News November 1, 2025
JGTL: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీటే: SP

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్ ఓపెన్ చేయాలని SP ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, విచారణ వ్యవస్థను వేగవంతం చేయడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.
Similar News
News November 2, 2025
MHBD: 22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు!

22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు. MHBD MPPS జమాండ్లపల్లి, ఈదులపుసపల్లి, గడ్డి గూడెం, దంతాలపల్లి-గున్నేపల్లి, లక్ష్మిపురం, నెల్లికుదురు-మునిగలవీడు, గూడూరు-అయోధ్యపురం, లక్ష్మిపురం, తొర్రూర్-వెలికట్ట, వెంకటాపురం, అమ్మాపురం, సీరోల్-కాంపల్లి, తాళ్లసంకీస, నర్సింహులపేట-బోడ్కాతండా, గార్ల-చినకిష్టాపురం, కురవి-గుండ్రతిమడుగు, హరిదాస్ తాండ, కేసముద్రం-కల్వల, బోడగుట్ట తాండ, చిన్నగూడూర్ జయ్యారంలో ఉన్నాయి.
News November 2, 2025
మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.
News November 2, 2025
నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.


