News March 17, 2025

JGTL: హాట్ టాపిక్‌గా KTR, తీన్మార్ మల్లన్న భేటీ..!

image

KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

Similar News

News March 17, 2025

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

image

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోదం లభించింది. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

News March 17, 2025

ప్రతి పంటకు నీరు ఇవ్వండి: కలెక్టర్

image

జిల్లాలో రబీలో సాగు అవుతున్న ప్రతి పంటకు సాగునీరు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ అధికారులు సాగునీటి అవసరాలను తెలియజేయాలన్నారు. పంచాయతీలలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. పి ఫోర్ సర్వే, వర్క్ ఫ్రం హోం, ఆధార్ క్యాంపులు, పన్ను సేకరణ, శనగ పంట కొనుగోళ్లపై కలెక్టర్ అరుణ్ బాబు జె.సి సూరజ్ గనూరే‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.

News March 17, 2025

కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.

error: Content is protected !!