News July 15, 2024
ప్రధాని మోదీతో ఝార్ఖండ్ సీఎం భేటీ

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి ఝార్ఖండ్ సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారు. కాగా భూకుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు.
Similar News
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.
News January 16, 2026
రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.


