News November 20, 2024
ఝార్ఖండ్ Exit Polls: 2019లో ఏం జరిగింది?

ఝార్ఖండ్లో 81 సీట్లు ఉన్నాయి. 2019లో JMM 30, BJP 25, CONG 16 సీట్లు గెలిచాయి. అయితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా UPAకు 43, BJPకి 27 సీట్లు వస్తాయంది. ABP VOTER UPA 35, BJP 32 గెలుస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ UPAకు 44, BJPకి 28 సీట్లు వస్తాయంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కరెక్టుగానే అంచనా వేశాయి. మరికాసేపట్లో రానున్న 2024 EXIT POLLSను వేగంగా తెలుసుకొనేందుకు WAY2NEWS ఫాలో అవ్వండి.
Similar News
News November 15, 2025
ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి నెటిజన్ల సపోర్ట్.. ఎందుకిలా?

పోలీసులు అరెస్టు చేసిన iBOMMA నిర్వాహకుడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు. OTT సబ్స్క్రిప్షన్ ధరలూ భారీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అతడు చట్టవిరుద్ధమైన పైరసీతో ఇండస్ట్రీకి భారీగా నష్టం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT?
News November 15, 2025
పర్స్ అమౌంట్.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల <<18297320>>రిటెన్షన్, రిలీజ్<<>> ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో జరిగే మినీ వేలం కోసం KKR వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు, అత్యల్పంగా MI వద్ద రూ.2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక CSK(రూ.43.4 కోట్లు), SRH(రూ.25.5 కోట్లు), LSG(రూ.22.9 కోట్లు), DC(రూ.21.8 కోట్లు), RCB(రూ.16.4 కోట్లు), RR(రూ.16.05 కోట్లు), GT(రూ.12.9 కోట్లు), PBKS(రూ.11.5 కోట్లు) అమౌంట్ కలిగి ఉంది.


