News November 20, 2024

ఝార్ఖండ్ EXIT POLLS: యాక్సిస్ మై ఇండియా కాన్ఫిడెన్స్ ఏంటి?

image

ఝార్ఖండ్‌పై ఇప్పటి వరకు 5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో BJP కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేస్తుందని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే BJP 25కు పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 53 సీట్లతో అధికారం చేపడుతుందని పేర్కొంది. అటూ ఇటూ కాకుండా పక్కాగా సీట్లు అంచనా వేయడంపై నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.

Similar News

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.

News October 26, 2025

తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

image

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News October 26, 2025

తుఫాను.. సెలవులపై కాసేపట్లో నిర్ణయం!

image

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుంది. దీంతో సోమవారం నుంచి చాలా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఇదే పెద్ద తుఫాను కావడంతో CM ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెలవులిచ్చారు. ఈ సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించి ఏయే జిల్లాల్లో సెలవులివ్వాలి, తల్లిదండ్రులకు మెసేజులు పంపాలనే దానిపై చర్చించనున్నారు.