News December 11, 2024

జియో కొత్త ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్

image

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు రోజుకు 2.5GB ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు చేసుకోవచ్చు. దీనికి తోడుగా రూ.2150 విలువైన(రూ.500 అజియో, ఈజ్ మై ట్రిప్ రూ.1500, స్విగ్గీ రూ.150) కూపన్లను అందిస్తోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.

Similar News

News November 24, 2025

TODAY HEADLINES

image

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్‌నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్

News November 24, 2025

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకున్నా: మారుతి

image

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకొని పనిచేశానని, ఆయన ఫొటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారని మారుతి అన్నారు. ‘రాజా‌సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ‘ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ <<18369126>>ఈ పాట <<>>చేశారు. కేరింతలతో థియేటర్స్ రీసౌండ్ వస్తాయి. ముగ్గురు హీరోయిన్స్‌తో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడాలి. రిలీజ్‌కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉంటారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తున్నా’ అని చెప్పారు.

News November 24, 2025

జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

image

తైవాన్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్‌ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్‌లో చైనా పేర్కొంది.