News March 16, 2024

లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.

Similar News

News March 29, 2025

2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.

News March 29, 2025

90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

image

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

News March 29, 2025

టాస్ గెలిచిన ముంబై

image

IPL: GTతో మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్(C), నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు.

GT: గిల్(C), బట్లర్, సాయి సుదర్శన్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

error: Content is protected !!