News March 16, 2024

లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.

Similar News

News February 3, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

image

<>ఆయుష్<<>> మంత్రిత్వశాఖ 7 కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 3, 2026

వంటింటి చిట్కాలు

image

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే చాలు.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోయాలి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.

News February 3, 2026

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రేపు అర్ధరాత్రికి ఆయన తిరిగి ఉండవల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.