News September 19, 2024
J&K తొలి విడత ఎన్నికలు.. 59 శాతం పోలింగ్ నమోదు

పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కిశ్త్వాడ్లో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. J&Kలో 90 స్థానాలుండగా ఫస్ట్ పేజ్లో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
Similar News
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్లో అమ్మే ప్రతి ఫోన్లో ఆ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>


