News October 13, 2025

JMKT: భారీగా తరలివచ్చిన పత్తి.. తగ్గిన ధర..!

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 174 వాహనాల్లో 1408 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 43 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,200 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.400 తగ్గింది.

Similar News

News October 13, 2025

HZB: ఈనెల 17న స్పెషల్ యాత్రా బస్సు

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు ఒకరోజు యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.430 టికెట్ చార్జీలతో స్పెషల్ బస్సు వెళుతుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971 నంబర్లను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

KNR: TRSMA రాష్ట్ర కన్వీనర్‌గా సౌగాని కొమురయ్య

image

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద విద్యా సంస్థల అధినేత సౌగాని కొమురయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ.. తనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమించేందుకు సహకరించిన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం, TRSMA లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తానని మాటిచ్చారు.

News October 12, 2025

కరీంనగర్: ‘శబరిమలలో బంగారం చోరీపై చర్యలు తీసుకోవాలి’

image

శబరిమలలో బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి వినతిపత్రం అందజేశారు. శబరిమల ధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ ఆస్తుల దుర్వినియోగం విషయంలో TDB బోర్డు నిబంధనల ఉల్లంఘనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ పర్యవేక్షణలో ఆలయ ఆస్తులపై ఆడిట్ చేయాలని కోరారు.